Udhayanidhi Stalin | డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఇటీవలే తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది.
Also Read..
Hijab | కఠినమైన హిజాబ్ చట్టాన్ని ఆమోదించిన ఇరాన్ పార్లమెంట్.. ఉల్లంఘిస్తే భారీ శిక్షే..!
India-Canada | కెనడాతో వివాదం.. భారత్కు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదన్న అమెరికా