న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు క్రిమినల్ కేసులో రెండేండ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షపడితే వారు పదవికి అనర్హులవుతారు.
ఇటీవల రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో దాని చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చట్టం కింద పిటిషనర్కు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం కానీ, ఇబ్బంది కానీ కలుగలేదని ధర్మాసనం తెలిపింది. పిటిషన్దారుకు ఈ చట్టంతో సంబంధం లేనందున పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నది.