న్యూఢిల్లీ, మార్చి 15: ఎలక్టోరల్ బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాండ్ల నెంబర్లు వెల్లడించకపోతే విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరణ ఇవ్వాలని ఎస్బీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.