న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత వివరాలను 30 రోజుల ముందు అధికారులు నోటీసు ద్వారా బహిరంగపర్చే విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధన ఇష్టపూర్వకంగా పెండ్లి చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తున్నదని, వారికి ప్రమాదకరంగా మారొచ్చని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
స్పెషల్ మ్యారేజ్ చట్టంలోని సెక్షన్ 5,6,7 ప్రకారం రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలనుకొనే జంట తమ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలను 30 రోజుల ముందే అధికారులకు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.