న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి ఖరీదైన ఫర్నిచర్, మంచాలకు తానే డబ్బులు చెల్లించానని మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఒక లేఖ రాశాడు. దీనిపై విచారణ జరపాలని అతడు కోరాడు.
దక్షిణాదికి చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారికి కరోల్బాగ్ ప్రాజెక్ట్లో లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా రూ. 90 లక్షల విలువైన వెండి పాత్రలను కేజ్రీవాల్ నివాసానికి ఇచ్చాడని ఆరోపించాడు. కాగా, ఇప్పటికే కేజ్రీవాల్ అధికారిక నివాస పునర్నిర్మాణానికి రూ.45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపిస్తున్నది.