Sudhanshu Trivedi : రాహుల్ గాంధీ పార్లమెంట్లో పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో మండల్ కమిషన్ను వ్యతిరేకించారని, కాంగ్రెస్ పార్టీకి కులంపై విశ్వాసం లేదని స్పష్టం చేశారని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది గుర్తుచేశారు. కులం బ్రిటిష్ హయాం నాటి జాఢ్యం అని అన్నారని చెప్పారు. త్రివేది మంగళవారం బుధవారం ప్రతినిధులతో మాట్లాడారు.
ఇందిరా గాంధీ సైతం కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ఈ విషయాలను తాను పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీని అడగాలని కోరుకుంటున్నానని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది అన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ తమ పూర్వీకుల మాటలను పక్కనపెట్టి పార్టీని నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. కాగా, లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (budget 2024) పై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
‘‘తమ కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడతారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించిన విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ‘‘సామాజిక, ఆర్థిక కుల గణన అనేది ఈ దేశంలోని 80 శాతం మంది ప్రజల డిమాండ్. కులం తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని ఈ రోజు పార్లమెంటులో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అన్నారు. ఇది 80% ప్రజలను అవమానించడమే’’ అని ప్రియాంక గాంధీ ఎక్స్ లో ఒక పోస్ట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జనాభాలో 80 శాతం మందిని ఇప్పుడు పార్లమెంటులో అవమానిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
Read More :