స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూర్లోని ఒక స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులంతా మంచానపడ్డారు. వాళ్లందరూ ఇళ్లకు వెళ్లే సరికి వాంతులు చేసుకున్నారు.
దాంతో తల్లిదండ్రులు ఆ పిల్లలను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కూల్లో భోజనం చేయడంతోనే పిల్లలు అనారోగ్యం పాలయ్యారని ధర్నా చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ వాడినట్లు వాళ్లు గుర్తించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు అధికారులు హామీ ఇచ్చారు.