Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) పది రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) పియూష్ కపాసియా (17) అనే విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పియూష్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ధర్మశాల (Dharamshala)లో ఉన్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు.
కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన పియూష్ కపాసియా (Piyush Kapasia) రెండేళ్లుగా కోటాలోని హాస్టల్లో ఉంటూ జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 13నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో పియూష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బృందాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పియూష్ కోసం గత 11 రోజులుగా తీవ్రంగా వెతికారు. అయితే, అతడి ఆచూకీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో డెహ్రాడూన్లో పియూష్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు టీమ్స్గా విడిపోయిన పోలీసులు డెహ్రాడూన్, హరిద్వార్కు వెళ్లారు. ఈ క్రమంలో ధర్మశాలలో పియూష్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ప్రస్తుతం పియూష్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అతను ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. అతడిని కోటాకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. అక్కడ కౌన్సెలింగ్ అనంతరం తదుపరి విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
Also Read..
Gold Seized | ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
Sachin Tendulkar | పహల్గామ్లో మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్న సచిన్.. పిక్స్ వైరల్
Uttar Pradesh | ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్.. చిన్నారులు సహా 15 మంది మృతి