Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల (devotees)తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది.
మాఘ పూర్ణిమ (Magh Purnima) సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయల్దేరారు. ఈ క్రమంలో కస్గంజ్ (Kasganj) సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది (tractor trolley plunges into pond). ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రకటించారు.
Also Read..
Lok Sabha Polls | ఐదు రాష్ట్రాల్లో ఆప్ – కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు.. సీట్ల సర్దుబాటు ఇలా..
Jaahnavi Kandula | జాహ్నవి కందుల మృతి కేసుపై రివ్యూ కోరిన భారత్
K Hoysala | గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. మైదానంలోనే కుప్పకూలి