Jaahnavi Kandula | అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula)ను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు (US court judgment)పై భారత రాయబార కార్యాలయం (Indian embassy ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ (review) కోరింది.
సీటెల్ పోలీసు అధికారి (Seattle police officer)పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్పును సమీక్షించాలని భారత్ (India) కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది. కేసు పురోగతిపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కౌంటీ అటార్నీ రివ్యూ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈమేరకు రాయబార కార్యాలయం తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice…
— India In Seattle (@IndiainSeattle) February 23, 2024
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన జాహ్నవి(23) నార్త్ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లారు. గత ఏడాది జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు 119 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీ కొనడంతో ఆమె 100 అడుగుల దూరం ఎగిరి పడ్డారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందారు. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది.
ఇక ఈ కేసు దర్యాప్తుపై పోలీస్ అధికారి అడెరెర్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఆమె చావుకు విలువ లేదు’ అన్నట్టు చులకనగా ఆయన మాట్లాడారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే, ఈ ప్రమాదంలో కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అక్కడి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై జాహ్నవి కుటుంబ సభ్యులు, సీటెల్ లోని జాహ్నవి స్నేహితులతో పాటు భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ తీర్పుపై రివ్యూ కోరింది.
Also Read..
Lok Sabha Polls | ఆప్-కాంగ్రెస్ మధ్య కుదిరిన డీల్.. నేడు అధికారిక ప్రకటన
K Hoysala | గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. మైదానంలోనే కుప్పకూలి
Manipur | మణిపూర్ యూనివర్సిటీలో బాంబు పేలుడు.. వ్యక్తి మృతి