Gold Seized | ముంబై ఎయిర్పోర్ట్లో (Mumbai Airport) భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). సుమారు రూ.2 కోట్లకుపైనే విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ (Mumbai Customs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 12 వేర్వేరు కేసుల్లో 4.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.2.49 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. బంగారాన్ని బట్టలు, ప్లాస్టిక్ ప్లేట్లు, టాంగ్ పౌడర్, క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 12 నాటికి విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు రూ.12 కోట్లకుపైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9 నుంచి 11 మధ్య విమానాశ్రయ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు రూ.97లక్షల విలువైన 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న మరో కేసులో దుబాయి నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి నుంచి ప్రయాణిస్తున్న భారతీయుడి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.1.43కోట్ల విలువన గోల్డ్ డస్ట్, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో, బేబీ పౌడర్ కంటైనర్లలో చాకచక్యంగా బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గురువారం కూడా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.4 కోట్లు విలువ చేసే 8 కిలోల బంగారంతో పాటు ఐఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Sachin Tendulkar | పహల్గామ్లో మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్న సచిన్.. పిక్స్ వైరల్
Uttar Pradesh | ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్.. చిన్నారులు సహా 15 మంది మృతి
K Hoysala | గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. మైదానంలోనే కుప్పకూలి