జైపూర్: పరీక్షల భయంతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి మృతదేహాన్ని చూసిన ఇంటి యజమాని గుండెపోటు (Heart Attack) తో మరణించాడు. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల పుష్పేంద్ర రాజ్పుత్, ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ధోల్పూర్లోని మాధవానంద కాలనీలో ఒక అద్దె ఇంట్లో అతడు ఉంటున్నాడు. స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే తన గ్రామానికి వెళ్లిన ఆ విద్యార్థి బుధవారం తిరిగి ధోల్పూర్ చేరుకున్నాడు. పరీక్షల భయంతో ఆ రాత్రి వేళ ఇంట్లోని సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, గురువారం ఉదయం సీలింగ్కు వేలాడుతున్న విద్యార్థి పుష్పేంద్ర మృతదేహాన్ని ఇంటి యజమాని అయిన 70 ఏళ్ల బహదూర్ సింగ్ చూశాడు. షాక్ వల్ల గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. విద్యార్థి రాసిన సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి పుష్పేంద్ర, గుండెపోటుతో మరణించిన ఇంటి యాజమాని బహదూర్ సింగ్ మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం తర్వాత వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: