Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజు గ్రీన్ మార్క్తో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు అదే ఊపును కొనసాగించాయి. ఉదయం 64,759 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ మొదలైంది. చివరకు 594.91 పాయింట్లు లాభపడి 64,958.69 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 181.20 పాయింట్లు పెరిగి 19,411.80 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్లో 2,378 షేర్లు పురోగమించగా.. 1,285 షేర్లు పతనమయ్యాయి. 164 షేర్లు మారలేదు. నిఫ్టీలో దివీస్ లేబొరేటరీస్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, హెచ్యూఎల్, టాటా మోటార్స్, సిప్లా, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్ ఒక శాతం క్షీణించగా.. మిగతా అన్ని రంగాల సూచీలు ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ ఒక్కొక్క శాతం వృద్ధి చెందాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున పెరిగాయి.