గువాహటి: అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మత్తమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను (Drug Peddlers) అరెస్టు చేశారు. వారిని రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను (Yaba Tablets) స్వాధీనం చేసుకున్నారు. వారిని ముజక్కిర్ హుస్సెయిన్, సైఫుల్ ఇస్లాంగా గుర్తించారు.
ఈ నెల 18న కరీంగంజ్లో (Karimganj) రూ.50 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. సర్గోల (Sargola) ప్రాంతంలో ఆటోలో తరలిస్తున్న 1060 కిలోల బరువున్న 96 వేల యాబా ట్యాబ్లెట్లను పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు.