పాట్నా: ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని పాలిగంజ్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఇండియా బ్లాక్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతలు తేజస్వీ యాదవ్, మిసా భారతితో కలిసి రాహుల్ గాంధీ స్టేజ్ పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టేజ్ పాక్షికంగా కూలింది. దీంతో మిసా భారతి చేతులు పట్టుకుని నడిచిన రాహుల్ గాంధీ కొంత బ్యాలెన్స్ కోల్పోయారు. అయితే వెంటనే ఆయన తేరుకున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్ నుంచి దిగిపోవాలని రాహుల్కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని మోదీపై మండిపడ్డారు. అయితే పాక్షికంగా కుంగిన వేదిక వద్ద రాహుల్ గాంధీ అదుపుతప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Overcrowding at the stage of Congress leader Rahul Gandhi and RJD leader Tejashwi Yadav in Paliaganj area of Bihar.
All leaders safe. pic.twitter.com/8U0Th5jPCL
— Anand Singh (@Anand_Journ) May 27, 2024