Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరిగే పోరాటమని మాజీ కేంద్ర మంత్రి, బాలాసోర్ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీకాంత్ జెనా అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎవరు అవుతారనేది పెద్ద విషయం కాదని, ఇవి సాధారణ ఎన్నికలు కాదని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించని పక్షంలో దేశం ప్రమాదంలో పడుతుందని అందుకే తాను రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. బాలాసోర్ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని, 2009లో తాను ఎంపీగా ఎన్నికయ్యానని, తనను గెలిపిస్తే దేశ రాజధాని ఢిల్లీ బాలాసోర్కు చేరువవుతుందని చెప్పారు.
బాలాసోర్ అభివృద్ధికి పార్లమెంట్ వేదికగా తాను పాటుపడతానని చెప్పారు. బాలాసోర్ రైల్వేస్టేషన్ను తాను ఆధునిక రైల్వే స్టేషన్గా మలిచేందుకు కృషి సాగించానని శ్రీకాంత్ జెనా గుర్తుచేశారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పోరాటం కాదని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సాగిస్తున్న పోరాటమని ఆయన అభివర్ణించారు.
Read More :
Vastu Shastra | చెరువును ఆనుకొని ఉన్న ఊర్లు బాగుండవు అంటారు.. అది నిజమేనా?