Supreme Court | ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల (Cases Against MPs And MLAs) విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు ( High Courts) అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలను సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Also Read..
Bengaluru Traffic | ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Haryana CM | మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం.. వీడియో వైరల్