న్యూఢిల్లీ, మార్చి 22: తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 11 మంది దోషులను గుజరాత్లోని బీజే పీ సర్కారు ఇటీవల విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గుజరాత్ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటుచేస్తామని తాజాగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.