న్యూఢిల్లీ : భిన్న ప్రాంతాల్లో విభిన్న రుచులు ప్రజలను అలరిస్తుంటాయి. ఇక సమోసా అంటే దేశీ స్నాక్స్ను ఇష్టపడే వారు అమితంగా ఆసక్తి చూపుతారు. ఆప్ఘన్ రుచులకు అద్దం పడుతూ ఢిల్లీలోని ఓ వీధి వ్యాపారి ఆప్ఘని చికెన్ సమోసాలను విక్రయిస్తుండటంతో ఈ స్పైసీ స్నాక్స్ను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. బాగా లేకుంటే డబ్బు వాపస్ ఇస్తానని చెబుతూ అతడు సమోసాలను విక్రయిస్తుండటంతో అతడికి ఆ డిష్పై ఉన్న విశ్వాసం ఎంతగా ఉందో వెల్లడిస్తోంది.
ఫుడ్ వ్లాగర్ రికార్డు చేసిన వీడియోలో వ్యాపారి భారతీయులందరికీ అభినందనలు తెలపడం చూడొచ్చు. ఢిల్లీలోని షహీన్బాగ్లో తన స్టాల్కు వచ్చి స్పెషల్ ఆప్ఘనీ చికెన్ సమోసాను రుచి చూడాలని ఇది చాలా రుచిగా ఉంటుందని అతడు చెబుతున్నాడు. ఆయిల్ లేకుండా తయారుచేసిన ఈ చికెన్ సమోసా టేస్టీగా ఉంటుందని రూ. 30కి విక్రయిస్తున్నానని చెప్పాడు.
ఆపై సమోసాను రెండు పీస్లుగా కట్ చేసి అందులో తండూరీ సాస్, మయనీస్, చట్నీ యాడ్ చేసి రుచికరమైన కాంబోను తయారుచేశారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 70 లక్షల మందికి పైగా వీక్షించారు.
Read More :