లక్నో : యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని యూపీ సర్కార్పై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కాషాయ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మండిపడ్డారు. రౌడీలు, గూండాలు చెలరేగుతుంటే అల్లరి మూకలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని దుయ్యబట్టారు.
కన్నౌజ్లో ఓ ఎంపీ తన గూండాలతో వెళ్లి ఔట్పోస్టులో ఉన్న పోలీసులందరినీ కొట్టినా యోగి సర్కార్ ప్రేక్షక పాత్రకు పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పని మరెవరో చేసి ఉంటే, ఈ ప్రభుత్వం బుల్డోజర్లతో నేరగాళ్ల ఇండ్లను నేలమట్టం చేసేదని అన్నారు.
ఎంపీ ఇంటి వద్ద ప్రభుత్వం బుల్డోజర్లను ఎందుకు తరలించడం లేదని యోగి సర్కార్ను అఖిలేష్ నిలదీశారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీలో మహిళా రెజ్లర్లు గొంతెత్తి అలసిపోయారని, వారు నిరసనలతో గళమెత్తినా మోదీ సర్కార్ నోరు మెదపడం లేదని ఎస్పీ చీఫ్ కాషాయ పాలకుల తీరును దుయ్యబట్టారు.
Read More
Brij Bhushan: బ్రిజ్ భూషణ్ ఇంటికి పోలీసులు.. 12 మంది నుంచి వాంగ్మూలం సేకరణ