న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh) నివాసానికి ఇవాళ ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లను, అడ్రస్, ఐడీ కార్డులను తీసుకున్నారు. సాక్ష్యం కోసమే ఆ డేటాను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్కు అనుకూలంగా ఉన్న అనేక మంది మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
బ్రిజ్పై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటి వరకు 137 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. అయితే బ్రిజ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను విచారించారో లేదో తెలియడం లేదు.