హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్టర్మ్ కోచింగ్ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నీట్కు సంబంధించి బాలికలకు 100, బాలురకు 50, జేఈఈలో 90 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcadmissions.org ద్వారా ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని, వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు.