ఊట్కూర్ :సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినం ( Rebellion day ) గా పాటించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ మండల కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు. గురువారం ఊట్కూరు మండలం బిజ్వార్లోని శ్రామిక భవన్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూస్వామ్య, రాచరిక, వెట్టిచాకిరీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిం దని పేర్కొన్నారు.
దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల త్యాగాలను ఆయన గుర్తు చేశారు. కుల, మతాలకు అతీతంగా పేదలు, రైతులు, కూలీలు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ,ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. సమావేశంలో పార్టీ గ్రామ నాయకుడు గోవర్ధన్రెడ్డి , పిరికి రాము, గోపి, బాలప్ప, శంకర్, సురేష్, తోక శివ, లొడ్డ తిమ్మప్ప, గోపాల్రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.