భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని సనోద పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టడంతో.. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడు.
ఆదివారం రాత్రి ఘటన జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఎవరో గుర్తించామని, పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Madhya Pradesh | Six people were dead in an accident between a car and a truck under Sanodha police station area in Sagar district. One person is being treated in the hospital. The truck driver has been identified, efforts are being made to arrest him: Abhishek Tiwari, Sagar SP… pic.twitter.com/no6D4fPOhA
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 16, 2023