Road Accident | కొత్త ఏడాది జార్ఖండ్ (Jharkhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషెద్పూర్ (Jamshedpur) వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఆదిత్యపూర్ (Adityapur)కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జంషెద్పూర్ పోలీసులు తెలిపారు.
Also Read..
New Year | ఆధ్యాత్మిక శోభ.. కొత్త ఏడాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Muhammad Waseem | ఒకే ఏడాది 100 సిక్సర్లు.. స్టార్ క్రికెటర్ల రికార్డు బ్రేక్ చేసిన పసికూన సారథి