Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్నగర్ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో (car collides with truck) ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. బాధితులంతా ఢిల్లీలోని షహదారా వాసులుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
World Cup 2023 | రేపే న్యూజిలాండ్తో సెమీస్ సమరం.. వాంఖడే పిచ్ను పరిశీలించిన భారత కోచ్
BRS | ఆమెకు ఆదరణ.. సౌభాగ్యలక్ష్మి పథకంపై మహిళా లోకం ఏమంటున్నదంటే?
Telangana | ఉద్యమ పునాదికే ఎసరు..