BRS | ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది బీఆర్ఎస్. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో సాయం అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక సాధికారతకు చేయూతనిస్తున్నది. గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి, బాలింతలకు కేసీఆర్ కిట్, ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య మహిళ పథకాలను అమలు చేస్తున్నది. ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నది. ఏ రంగంలో చూసినా అధిక ప్రాధాన్యమిస్తూ మహిళా సంక్షేమ సౌరభాన్ని చాటుతున్నది. ఆడబిడ్డలను అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పదేండ్లలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే స్ఫూర్తిగా నిలిచాయి. తాజాగా మరో వినూత్న పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. సౌభాగ్యలక్ష్మి పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున జీవనభృతి ఇస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి పథకంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
శక్కర్నగర్, నవంబర్ 13:బీఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారంలోకి రాగానే అందించే పథకం ‘సౌభాగ్యలక్ష్మి’. ఈ పథకం మహిళలకు వరంగా మారనున్నది. గతంలో కూడా సీఎం కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇందులో భాగంగానే మ్యానిఫెస్టోలో పేర్కొన్న బీపీఎల్ కుటుంబాలకు సౌభాగ్య లక్ష్మి పథకం వరంగా మారబోతున్నది. ప్రతి నెలా రూ.3వేలు అందిస్తే మాలాంటి చిరు వ్యాపారులకు చేయూతగా ఉంటుంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపడతున్న సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇప్పుడు అమలు చేస్తున్న చాలా పథకాలు కూడా మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వివిధ పథకాల రూపంలో మహిళలకు మేలు చేస్తున్నారు. గర్భిణి సమయంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్, సర్కారు దవాఖానలో ప్రసవం చేసుకుంటే మగబిడ్డ పుడితే రూ.12000, ఆడబిడ్డ పుడితే రూ.13000 ఇస్తున్నరు. అమ్మఒడి వాహనం ద్వారా దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేయించి, తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. బాలికలకు భరోసా ఇచ్చేలా హెల్త్ అండ్ హైజిన్ కిట్లు ఇస్తున్నారు. షీ టీములను ఏర్పాటు చేసి ఈవ్టీజర్లు, ఆకతాయిల నుంచి విముక్తి కల్పించారు. పెండ్లి సమయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రూపంలో రూ.లక్షా116 అందజేస్తున్నారు. ఆరోగ్య మహిళ ద్వారా దవాఖానల్లో ప్రత్యేక పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఏ వయసులో.. ఏ విధంగా సహాయపడాలో సీఎం కేసీఆర్కు తెలుసు. అందుకే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తాజా మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పథకాన్ని పొందుపర్చారు. ఉపాధి లేని మహిళల కోసం ప్రతి నెలా రూ.3వేల జీవనభృతిని ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా హర్షించదగ్గ విషయం.
రుద్రూర్, నవంబర్ 13: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు ఆడబిడ్డలంటే ఎనలేని గౌరవం. ఆయన ఏ పథకం పెట్టినా.. ఆడబిడ్డలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పదేండ్లలో ఎన్నో పథకాలు పెట్టారు.. అందులో ఎక్కువ కేటాయించింది ఆడబిడ్డలకే. కేసీఆర్ పాలనలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అన్నింటా దూసుకుపోతున్నారు. ఇప్పుడొచ్చే ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించిన మరోమంచి పథకం సౌభాగ్యలక్ష్మి. దీంతో నిరుపేద మహిళలకు చేయూతనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి ఇంటికీ వందశాతం సంక్షేమ పథకాలు అందుతాయి.
బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో ఆచరణ సాధ్యంగా ఉన్నది. ముఖ్యంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల భృతి అందజేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చడం ఎంతో ఆనందంగా ఉన్నది. నెలకు రూ.3వేల పింఛన్ అంటే సాధారణ, మధ్యతరగతి మహిళలకు ఇంటి, సొంత అవసరలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. మహిళల ఉన్నతి గురించి ఆలోచించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. మ్యానిఫెస్టోను అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించడం సంతోషకరం.
ఆర్మూర్, నవంబర్ 13: బీఆర్ఎస్ అధినేత విడుదల చేసిన మ్యానిఫెస్టో చాలా బాగున్నది. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు రూ. 3వేల భృతి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఇప్పటి వరకు వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లతో ఎంతో మేలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు అర్హులైన మహిళాలందరికీ భృతి ఇవ్వడం చాలా ఆనందంగా ఉన్నది. ఇకపై మహిళలు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
రెంజల్, నవంబర్ 13: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు ఎంతో మేలు జరుగుతున్నది. మహిళా సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా పేద కుటుంబాల మహిళలకు నెలకు రూ.3వేల జీవనభృతిని అందిస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరం.
కోటగిరి, నవంబర్ 13: కేసీఆర్ ప్రజల మనిషి. ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు. ఆసరా పింఛన్లు రూ. 5వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచడం హర్షణీయం. రైతుబంధు రూ.16 వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల భృతి ఇలా ఎన్నో పథకాలను మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేసే దమ్మున్న నేత కేసీఆర్.
ప్రతి నెలా రూ. 3000 భృతి ఇవ్వడం పేద మహిళలకు వరంలాంటిది. సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన పేద మహిళలకు గౌరవ భృతి ప్రకటించడం గర్వించదగ్గ విషయం. మహిళలకు ఈ భృతి చేయూతనిస్తుంది. ఆర్థికంగా ఎంతో సహకరిస్తుంది. మహిళా లోకమంతా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి పథకం సరికొత్త ఆలోచన. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబంలోని మహిళలకు నెలనెలా రూ.3వేల జీవనభృతి అందుతుంది. దీంతో ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉంటారు. రూ.3వేల భృతి ద్వారా ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడతాయి. కుటుంబ పోషణకు మావంతు తోడ్పాటును అందించే అవకాశం దక్కుతుంది.
నవీపేట, నవంబర్ 13: సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు ఆసరా పింఛన్ల తరహాలో నెలకు రూ. మూడువేల భృతి ఇవ్వ డం వరంలాంటిది. ఎంతో మంది పేద మహిళలు ఉపాధి లేక పస్తులు ఉంటున్నారు. అలాంటి మహిళలకు గౌరవ భృతి ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ తీసుకొచ్చే పథకాలు బాగున్నాయి. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద మహిళలకు నెలకు రూ. 3000 భృతి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
కోటగిరి, నవంబర్ 13: రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో సముచిత న్యాయం చేస్తుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు, మహిళల కోసం సంక్షేమ పథకాలు తదితర వాటిపై హామీ ఇవ్వడం హర్షణీయం. రైతుబంధు పెంపు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి కేసీఆర్ బీమా స్కీం ఎంతో మంచిది.