న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అతి విలువైన లోహాల దిగుమతులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ మరోసారి వీటిపై కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. బంగారంతోపాటు ప్లాటినంపై ఇప్పటికే సుంకాన్ని పెంచిన కేంద్రం..తాజాగా వెండిపై సుంకాన్ని 10 శాతానికి పెంచింది. ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ 6.1 శాతంగా ఉన్నది.
వెండి నాణేలు, కడ్డీలతోపాటు పసిడి, ప్లాటినం ఆభరణాలపై కూడా సుంకాన్ని సవరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయంగా ఉండే రిఫైనరీలకు పెద్దదెబ్బని కామా జ్యూవెల్లరీ ఫౌండర్, ఎండీ కోలిన్ షా తెలిపారు. 2022లో భారత్ 8 వేల టన్నుల వెండిని దిగుమతి చేసుకున్నది.