బటిండ (పంజాబ్), ఏప్రిల్ 24: పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
లోక్సభ ఎన్నికలు ఇప్పటికే ప్రారంభం కాగా, ఏడో దశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరుగనున్నది. ఇక్కడ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.