Siddaramaiah | యాసిడ్ దాడి బాధితురాలికి (Acid Attack Survivor) సీఎంవోలో ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) హామీ ఇచ్చారు. బెంగళూరులో 2022 ఏప్రిల్ 28న యాసిడ్ దాడికి గురైన బాధితురాలు శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి జనతా దర్శన్ కు వచ్చారు. యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు. ఈ మేరకు తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ సీంను కోరారు.
స్పందించిన సిద్ధరామయ్య.. సీఎంవోలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాధితురాలికి తన మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా గతంలో సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఉద్యోగ హామీ ఇచ్చారని, కానీ అమలు కాలేదని బాధితురాలు సీఎంకు తెలిపింది.
Also Read..
Emmanuel Macron | ఫ్రాన్స్ లో అల్లర్లు.. మ్యూజిక్ కన్సర్ట్ లో అధ్యక్షుడు.. వీడియో
Parineeti Chopra | అమృత్సర్లో రాఘవ్-పరిణీతి పూజలు.. ఫొటోలు వైరల్
Allan Border | పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన క్రికెట్ దిగ్గజం.. 80 ఏళ్లు జీవిస్తే అద్భుతమే అంటూ..