ముంబై : దేశ విభజనపై శివసేన కొత్త కోణం బయటపెట్టింది. గాంధీకి బదులుగా జిన్నాను గాడ్సే చంపినట్లయితే.. దేశం విభజన జరిగి ఉండేది కాదని మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) దేశ విభజనకు కొత్త భాష్యం చెప్పారు. అంతటితో ఆగకుండా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని భారతదేశ విభజన సమయంతో పోల్చారు. ఒక దేశ అస్తిత్వం, సార్వభౌమత్వాన్ని కోల్పోవడం ఎంత బాధాకరమైనదో ఆఫ్ఘాన్ పరిస్థితి గుర్తు చేస్తున్నదని తెలిపారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో తన కాలమ్ ‘రోఖ్తోక్’ లో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు రాశారు.
మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే.. మహ్మద్ అలీ జిన్నాను చంపినట్లయితే.. దేశ విభజన జరగకపోయి ఉండేదని సంజయ్ రౌత్ తెలిపారు. ఒకవేళ అలా జిన్నాను చంపినట్లయితే ఆగస్టు 14 న విభజన స్మారక దినోత్సవాన్ని జరుపుకోవలసిన అవసరం ఉండేది కాదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14 న విభజన విభీష్క స్మారక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.
విభజన ద్వారా వేరైన భాగాన్ని తిరిగి దేశంలో చేర్చని వరకు ఆ విభజన నొప్పిని ఎలా తగ్గించవచ్చునని ప్రశ్నించారు. అఖండ్ భారతదేశం ఏర్పడాలని మేమూ భావిస్తున్నాం, కానీ అది సాధ్యమయ్యేలా లేదని పేర్కొన్నారు. గాంధీ రాజకీయాల్లో చురుకుగా లేనప్పుడు ముస్లింలను బ్రిటీషర్లు ప్రత్యేక ఓటర్లుగా గుర్తించారని, అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముస్లింలను ప్రత్యేక ఓటర్లుగా గుర్తించేందుకు నెహ్రూ నిరాకరించారని రాశారు.
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్గా లా గణేశన్ నియామకం
లాక్డౌన్ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..