దేశవిదేశాల్లో అపదలో ఆదుకునే ఏకైక సంస్థగా ఆవతరించింది రెడ్ క్రాస్. 1864 లో సరిగ్గా ఇదే రోజున రెడ్ క్రాస్ (Red Cross) ప్రారంభమైంది. 157 ఏండ్ల క్రితం 12 దేశాల ఏకతాటిపైకి వచ్చి ఈ సంస్థను నెలకొల్పాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ సంస్థ సేవలకుగాను మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధ ప్రాంతంలో గాయపడిన సైనికుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి జెనీవాలోని హోటల్లో 12 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని మొదటి జెనీవా సమావేశం అంటారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అధికారికంగా ఇదే రోజున స్థాపించబడింది.
19 వ శతాబ్దపు మొదటి 70 సంవత్సరాలు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాలకు సాక్షీభూతంగా నిలిచాయి. 1861 లో అమెరికన్ సివిల్ వార్ ప్రారంభమైంది. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. అంతకు ముందు వాటర్లూ, క్రిమియా, ఐరోపాలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరిగాయి. వీటిలోనూ లక్షలాది మంది చనిపోయారు. యుద్ధ సమయంలో, తర్వాత కూడా శత్రు దేశాలు ఒకరినొకరు అమానవీయంగా చూసుకున్నాయి. ఈ ప్రవర్తనలను ఆపేందుకు దేశాల మధ్య ఎటువంటి చట్టంగానీ, ఒప్పందంగానీ లేదు. ఈ అమానవీయ దురాగతాలకు సాక్షుల్లో ఒకరు స్విట్జర్లాండ్కు చెందిన హెన్రీ డునాంట్ అనే కార్యకర్త. 1859 లో ఇటలీలోని సోల్ఫిరెనో యుద్ధంలో హెన్రీ ఈ భయంకర నిజాలను చూశాడు. ఈ యుద్ధంలో 40 వేల మంది సైనికులు మరణించగా.. వారిలో చాలామంది వేదనతో చనిపోయారు. వారికి ఎటువంటి వైద్య సహాయం అందలేదు.
యుద్ధ సమయాల్లో గాయపడిన వారికి సహాయం చేయడానికి, అమానవీయ దురాగతాలను నిరోధించడానికి దేశాల మధ్య ఒప్పందం అవసరమని హెన్రీ నొక్కిచెప్పారు. అనంతరం జెనీవాలో 12 దేశాల ప్రతినిధులు సమావేశమై రెడ్ క్రాస్ సంస్థ స్థాపనకు పూనుకున్నాయి. సంస్థ ప్రారంభం నుంచి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధంలో గాయపడిన సైనికులు, పౌరులు, యుద్ధ ఖైదీల హక్కులను కాపాడటానికి రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. 1901 లో హెన్రీ డునాంట్, ఫ్రెడరిక్ పాస్సీతో కలిసి శాంతి ప్రయత్నాల కోసం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మానవతావాద కృషికి రెడ్ క్రాస్ 1917, 1944 లలో నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది.
2017 : ట్రిపుల్ తలాక్ను చట్టవిరుద్ధమని ప్రకటించిన భారతదేశం సుప్రీంకోర్టు
1979 : ప్రధానమంత్రి చౌదరి చరణ్సింగ్ రాజీనామా అనంతరం లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
1963 : హైపర్ సోనిక్ రాకెట్ ఎక్స్-15 లో అంతరిక్షానికి బయల్దేరిన అమెరికా వైమానిక దళానికి చెందిన జోసెఫ్ వాకర్
1932 : ఇంగ్లండ్లో ప్రయోగాత్మక టీవీ ప్రసారాలు ప్రారంభం
1865 : లిక్విడ్ సబ్బుకు పేటెంట్ పొందిన విలియం షెఫర్డ్
1693 : తమిళనాడు రాజధానిగా చెన్నై నగరం వ్యవస్థాపకం
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..