Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 3 స్థానాల్లో ముందంజలో ఉంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ స్పందించారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో కూడా నేను లేను. ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించని నేను పార్టీ ఓటమిపై స్పందించడం చాలా కష్టం’ అని వ్యాఖ్యానించారు.