Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహా నగరం సహా పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో
కూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీట
మునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు రాత్రంతా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
#WATCH | Tamil Nadu: Several parts of Chennai experience waterlogging due to incessant rainfall over the past two days.
Visuals from Kolathur area in Chennai. pic.twitter.com/jXCYaQoIdy
— ANI (@ANI) November 2, 2022
#WATCH | Tamil Nadu: Several parts of Chennai face waterlogging following incessant rainfall over the past two days.
Visuals from East Avenue, Korattur in Chennai where water has entered residential areas. pic.twitter.com/7jQSesSLAI
— ANI (@ANI) November 2, 2022