Union Budget 2023-24 | ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్గా పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
1. సమ్మిళిత అభివృద్ధి
2. చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం
3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
4. యువశక్తి
5. గ్రీన్ గ్రోత్
6. ఆర్థిక రంగం బలోపేతం
7. వనరులను వాడుకోవడం