ముంబై: స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు 2 శాతం పైగా పడిపోయాయి. స్టాక్మార్కెట్లు 58 వేల దిగువకు పడిపోయాయి. ఐదో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలను ఎదుర్కోవడం సెన్సెక్స్, నిఫ్టీని దెబ్బతీసింది. ఆసియా మార్కెట్ల పతన ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.