శ్రీనగర్, సెప్టెంబర్ 16: పాక్ సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు శనివారం కాల్చి చంపాయి. ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్ సంయుక్తంగా బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి తనిఖీలు చేపట్టాయి.
ఉరిలోని హల్తాంగాలో కొందరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయి. ఈ మేరకు ఆర్మీ చినార్ కార్ప్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది. కాగా, అనంత్నాగ్ జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్ శనివారం నాలుగో రోజు కూడా కొనసాగింది. టెర్రరిస్టులు దాగి ఉన్న ప్రదేశాన్ని కనుగొనడానికి భద్రతా బలగాలు డ్రోన్లను వినియోగిస్తున్నాయి.