న్యూఢిల్లీ, జూలై 18: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం పేర్కొన్నది. బాధిత రోగి ఈనెల 13న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరులో దిగాడు. తర్వాత వ్యాధి లక్షణాలతో ఓ దవాఖానలో చేరాడు. శాంపిల్స్ను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా.. మంకీపాక్స్ సోకినట్టు తేలిందని అధికారి పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన కొల్లాం జిల్లాకు చెందిన వ్కక్తిలో మంకీపాక్స్ తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయండి
మంకీపాక్స్ కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్ని విమానాశ్రయాలు, పోర్టుల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఎయిర్పోర్టులు, పోర్టుల హెల్త్ అధికారులతో సమీక్ష నిర్వహించింది.