వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు.
ప్రశాంత్ కిశోర్ చేరిక, ఆయన ప్రతిపాదనలపై ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై ఇందులో చర్చిస్తామని, ఇక.. ఇదే తుది నిర్ణయమని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అధ్యక్షతన పీకే ప్రతిపాదనల విషయంలో సోనియా గాంధీ ఓ కమిటీ వేసింది. ఇందులో కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, అంబికా సోనీ, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, సూర్జేవాలా సభ్యులు. ఇప్పటికే పీకే ప్రతిపాదనలపై లోతుగా చర్చించిన ఈ కమిటీ… తుది రిపోర్టును సోనియా గాంధీకి అందజేశారు. ఈ రిపోర్టు తర్వాతే సోనియా గాంధీ ఇంట్లో తుది సమావేశం జరగనుంది.