న్యూఢిల్లీ, డిసెంబర్ 22: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
నోట్ల రద్దుకు సంబంధించిన రికార్డులను సమర్పించాల్సిందిగా కేంద్రంతో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 7న జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ నజీర్ జనవరి 4న పదవీ విరమణ చేయనుండగా రెండు రోజుల ముందు నిర్ణయాన్ని వెల్లడించబోవడం గమనార్హం.