రాజీవ్ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, మే 18: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ కేసులో పెరారివళన్ సహా ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో కోర్టు తీర్పునిచ్చింది. పెరారివళన్ 30 ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పెరారివళన్ విడుదలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.