చిలిపిచెడ్, ఏప్రిల్ 21: కాళేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సోమక్కపేట సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో సోమక్కపేట, శీలాంపల్లి, ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి, గంగారం, చిలిపిచెడ్, చండూర్, గౌతాపూర్, చిట్కుల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు హల్దీవాగు ద్వారా నర్సాపూర్లోని వెల్దుర్తి, కొల్చారం మండలంలో ప్రవాహిస్తున్నాయన్నా రు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని మం డలంలోని చెరువులు, కుంటలు నింపుతామన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
ఆడపిల్లలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.చిలిపిచెడ్ రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాలకు సం బంధించిన 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాంచంద్రరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సుభాశ్రెడ్డి, జిల్లా యూత్ మాజీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.గోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ఇస్లాంపూర్లో పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 21: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టుబాలకృష్ణారెడ్డి అన్నారు. జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, సర్పంచ్ సుకన్యతో కలిసి బుధవారం మండలంలోని ఇస్లాంపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు . కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖాధికారి నుస్రత్, ఐకేపీ ఏపీఎం రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో …
వెల్దుర్తి, ఏప్రిల్ 21. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు మద్దతు ధర లభిస్తుందని వెల్దుర్తి సహకార సంఘం ఉపాధ్యక్షుడు మురళీ, సీఈవో సిద్ధ్దయ్యలు అన్నారు. బుధవారం మండలంలోని కుకునూర్, మానేపల్లి, మంగళపర్తి, ధర్మారం, దామరంచ, మన్నెవారి జలాల్పూర్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి ప్రారంభించారు.