న్యూఢిల్లీ : శివసేన నేత సుధీర్ సూరి హత్యోదంతం పంజాబ్లో రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఈ హత్యపై రాజకీయ పార్టీలు పరస్పరం బ్లేమ్ గేమ్కు తెరలేపాయి. అమృత్సర్లోని గోపాల్ మందిర్ ఎదుట నవంబర్ 4న జరిగిన నిరసనల సందర్భంగా సుధీర్ సూరి హత్యకు గురయ్యారు.
సుధీర్ సూరి హత్యానంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆప్ సర్కార్ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దాడి తమ పనేనని ఖలిస్తానీ సంస్ధ జస్టిస్ లీగ్ ఇండియా ప్రకటించిన అనంతరం ఖలిస్తానీ సంస్ధలకు హత్యతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక సుధీర్ సూరి హత్యలో బీజేపీ, ఆరెస్సెస్ల ప్రమేయం ఉందని సంగ్రూర్ ఎంపీ సిమ్రన్జిత్ సింగ్ మాన్ ఆరోపించారు.
సానుభూతి ఓట్ల కోసం హత్యకు బీజేపీ ప్లాన్ చేసిందని దుయ్యబట్టారు. ఆప్ పోటీ చేస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరెస్సెస్, బీజేపీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని ఆరోపించారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఆప్ను దెబ్బతీసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.