న్యూఢిల్లీ, ఆగస్టు 26: పక్షపాతానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను బదిలీ చేయాలని కోరుతూ తాను చేసిన తీవ్రమైన విజ్ఞప్తులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆగస్టులో మూడు లేఖలు రాశారు. తన లేఖల్లో రాజస్థాన్లోని తన మాతృ హైకోర్టులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితి గురించి జస్టిస్ మెహతా పేర్కొన్నారు. ప్రకాశ్ అవకతవకలకు పాల్పడ్డాని,న్యాయపరమైన విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.