నేరేడుచర్ల, సెప్టెంబర్ 17 : గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోల్ నవీన్ కుమార్ అన్నారు, గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచడం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానేరేడుచర్ల మండలం పులగంబండ తండాలో గిరిజనులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించి మొత్తంగా 1,326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా నిర్ణయించారన్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయం పాలకులుగా చేసి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ కాదు గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ సైదులు, యువజన విభాగం నాయకులు పెరుమాళ్ల సతీష్ కుమార్, తకెళ్ల నాగార్జున, రూపావత్ జైపాల్ నాయక్, భూక్యా సంతోష్ నాయక్, పర్వతం చంద్రగిరి, రామావత్ గోపినాధ్, గిరిజన మహిళలు పాల్గొన్నారు.