జైపూర్, నవంబర్ 2: రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో ముంచెత్తారని, దీనిని అంత తేలికగా తీసుకోరాదని పైలట్ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
సీఎం పదవి విషయంలో కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించాలని కోరారు. గత సెప్టెంబర్లో సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి, గెహ్లాట్కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు పార్లమెంట్లో ప్రధాని మోదీ అప్పటి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ను పొగిడారని, ఆ తరువాత ఆయన పార్టీని వదిలి సొంత కుంపటి పెట్టుకున్నారని పైలట్ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని గెహ్లాట్ను పొగిడారని, దీనిని లైట్గా తీసుకోవద్దని అన్నారు.