న్యూఢిల్లీ : కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్టీ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం పట్ల రాజస్ధాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ కాంగ్రెస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు ప్రతిష్టాత్మక పదవిని కేటాయించినందుకు సీనియర్ నేతలకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని ప్రతిన బూనారు. ఇక సీడబ్ల్యూసీలో స్ధానం కల్పించినందుకు పార్టీ అగ్రనేతలకు కాంగ్రెస్ లోక్సభ ఎంపీ గౌరవ్ గగోయ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిష్టాత్మక పదవి అందించి పార్టీకి, దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారని ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలను గౌరవ్ గగోయ్ కొనియాడారు. మరోవైపు సీడబ్ల్యూసీలో చోటు దక్కడం తనకు పార్టీ ఇచ్చిన గౌరవానికి సంకేతమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.
Read More :