న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే భారీగా నష్టాలను చవిచూసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వేల ఆదాయం 2019-20 సంవత్సరంతో పోలిస్తే రూ.34,154 కోట్ల ఆదాయం తగ్గిందని తెలిపారు. ప్రజా రవాణాలో రూ.35,421, ఇతర కోచింగ్ ఆదాయంలో రూ.2,544 కోట్ల రాబడి తగ్గిందన్నారు. ఈ నష్టాలను సరుకు రవాణా తదితర మార్గాల్లో పాక్షికంగా భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
అంతకు ముందు జాల్నా రైల్వేస్టేషన్లో అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి పాల్గొన్నారు. ప్యాసింజర్ రైలు సెగ్మెంట్ నష్టాల్లో కూరుకుపోతుందని, టికెట్ చార్జీల పెంపు ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నందున పెంచడం లేదన్నారు. మహమ్మారి సమయంలో రైల్వేలు రూ.36వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయన్నారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆదాయాన్ని సృష్టిస్తాయని.. కొవిడ్ మహమ్మారి సమయంలో ఈ రైళ్లు వస్తువులను తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర పోషించాయని చెప్పారు.