అమృత్సర్: పంజాబ్లోని తర్న్ తరన్లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రనేడ్తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్కు రాకెట్ గ్రనేడ్ తగిలింది. అయితే పిల్లర్కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. స్టేషన్ స్వల్పంగానే ధ్వంసమయిందని, ఎవరి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు. కాగా, తర్న్ తరన్ పోలీస్ స్టేషన్ను పంజాబ్ డీజీపీ, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించనున్నారు.
కాగా, రాకెట్ చాలా శక్తివంతమైనదని అయితే పిల్లర్కు ఢీకొట్టిన తర్వత అది మళ్లీ ఎగరడంతో స్టేషన్ను ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు వెల్లడించారు.