PUBG Love Story | న్యూఢిల్లీ, జూన్ 21: తాను పాకిస్థాన్కు తిరిగి వెళ్లనని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని పాకిస్థానీ మహిళ సీమా హైదర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుక్రవారం లేఖ రాసింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల వల్ల తాను తీవ్రంగా ప్రభావితురాలినయ్యానని తెలిపింది.
‘ఇండియా టుడే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా హైదర్ మాట్లాడుతూ తనను భారత్లోనే ఉండనివ్వాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్నూ కోరింది. ‘నేను భారత్కు వెళుతున్నానని తెలిసి ఉంటే పాక్లో ఎవరైనా సరే నన్ను చంపేసి ఉండేవారు. నేను గూఢచారిని కాదు. నిజం త్వరలోనే తెలుస్తుంది’ అని ఆమె అన్నారు. తనకు వేరే మార్గం లేకపోవడంతో అక్రమంగా సరిహద్దులు దాటాల్సి వచ్చిందని, తన గతాన్ని గురించి తానేమీ దాచడం లేదని ఆమె పేర్కొంది.